గ్రీన్ సిటీ బ్రిడ్జి వద్ద లారీ ఢీకొని బైక్‌ రైడర్‌కు గాయాలు

  1. వికారాబాద్ జిల్లా | తాండూర్
గ్రీన్ సిటీ బ్రిడ్జి వద్ద లారీ ఢీకొని బైక్‌ రైడర్‌కు గాయాలు

తాండూర్ పట్టణంలోని గ్రీన్ సిటీ బ్రిడ్జి చివరలో అతి వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి గాయపడాడు.

గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై స్థానికులు తాండూర్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.